కొందరిని చూస్తే తిట్టాలో.. పట్టుకుని నాలుగు తన్నాలో కూడా తెలియని పరిస్థితి. నలుగురికి మంచి చెడులు చెప్పే వృత్తిలో ఉంటారు. కానీ వారు చేసేవి మాత్రం నీచమైన పనులు. ఆ పనులు చేయొద్దని ఎంత చెప్పినా పట్టించుకోరు. నేను ఇంతే అని అంటారు. లేదంటే ఇతరులపై నిందలు మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి ఘటనే ఈ మధ్య ఒకటి జరిగింది. ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు అన్నాట్లే వ్యవహరించాడు ఒక లాయర్.
పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే తన భార్య బోర్ కొట్టింది ఒక లాయర్ కు. దీంతో ఇల్లాలిని వదిలేసి ప్రియురాలితో కాపురం స్టార్ట్ చేశాడు. దాంతో ఆగకుండా మరికొందరు మహిళలతో వివాహేతర సంబంధాలను పెట్టుకున్నాడు ఈ ఘనుడు.చేసేది న్యాయవాద వృత్తే అయినా మోసాలే తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు.
అతడి భార్య కూడా లాయరే.. అయినా కానీ తను న్యాయమైన పని చేస్తలేడు. తన భార్యకే అన్యాయం చేయాలని చూశాడు. భార్యను వదిలేసి..డ్రైవర్ భార్యతో కాపురం పెట్టాడు ఈ ఘరానా లాయర్. అంతటితో ఆగకుండా మరికొందరితోనూ వివాహేతర సంబంధాలు నడిపించాడు. ఈ ఘరానా లాయర్ పై ఇప్పటికే పలు కాల్మనీ కేసులు కూడా ఉన్నాయట.
అయితే గర్భవతిగా ఉన్న భార్యను పుట్టింటికి పంపించాడు. ఆ తర్వాత ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు చిత్తురుకు చెందిన చంద్రమౌళి అనే లాయర్. ఈయనకు కవితతో 2005లో వివాహం జరిగింది. ఆమె కూడా లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. కొన్నేళ్లు కాపురం సాఫీగానే సాగింది. తర్వాత ఏమైందో కానీ.. గర్భవతిగా ఉన్న భార్యను పుట్టింటికి పంపించాడు. ఇక నువ్వు అవసరం లేదంటూ వాదులాటకు దిగాడు. ఏమైందని అడిగితే ఏదో ఒక కారణం చెప్పి వదిలించుకునే ప్రయత్నం చేశాడు ఈ లాయర్. దీంతో భర్తపై కేసు పెట్టింది బాధిత మహిళ.
ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. అయితే భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ఫ్లాన్ చేసింది. అనుకున్నట్లుగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది కొద్దిలో అతను తప్పించుకున్నాడు. దీనిపై బాధిత మహిళ మాట్లాడుతూ.. తనని దూరం పెట్టాన తర్వాత ఆ లాయర్ అనేకమంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని తెలిపింది. ఒక్కో పేరుతో ఒక్కో ఊరిలో చెలామణి అయ్యే వాడని తెలిపింది. అలాగే అతడి నుంచి తనకు రక్షణ కావాలని పోలీసులను కోరుతోంది కవిత. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు చేపట్టారు. దీంతో అతగాడి బాగోతం తెలిసిన వారంతా చర్చించుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?