Ayodhya Rama Mandir: మోడి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న అయోధ్య లోని రామ మందిరానికి అన్నీ రాష్ట్రాలు, అన్నీ మతాల వారు తాము చేయగలిగిన అంత సహాయం చేస్తున్నారు. భారతదేశ ప్రజలు అందరూ రామాలయం నిర్మాణం కోసం విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రం లోని క్రైస్తవ సముదాయానికి చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు మరియు విద్యానిపుణులు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రూ.కోటి విరాళం గా ప్రకటించారు.
ఇటీవల బెంగళూరులో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణ ఏర్పాటు చేసిన సభలో కొందరు క్రైస్తవ సమాజానికి చెందిన వారు పాల్గొన్నారు. వారిలో కొంత మంది వివిధ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలు అలాగే మరి కొంతమంది విద్యానిపుణులు ఉన్నారు. అయితే ఆ సభలో అయోధ్య రామమందిర నిర్మాణ నిమిత్తం తమ వంతు సహాయంగా వీరు విరాళం ఇవ్వాలనుకుని రూ.కోటి ప్రకటించారు. ఈ సభలో ఉపముఖ్యమంత్రి, డీసీఎం అశ్వత్థనారాయణ మాట్లాడుతూ దేశంలో బీజేపీ పార్టీ మైనారిటీలకు వ్యతిరేకమనేది కొందరు చేస్తున్న దుష్ప్రచారం అని అన్నారు.
అంతేకాకుండా తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో నివసిస్తున్న ఓ ముస్లిం కుటుంబం అయోధ్య రామమందిర నిర్మాణానికి తమ వంతు సాయంగా విరాళాలు అందజేసింది. ఈ సందర్భంగా మందిరానికి విరాలలను అందజేసిన ముస్లిం కుటుంబ సభ్యులను రామ్ భవన్ నిర్వాహకులు సత్కరించి వారిని అభినందించారు. ఆలాగే ‘మన మతాలు, మన ప్రాంతాలు వేరు కావొచ్చు కానీ మనమంతా హిందుస్థానీలం. బయటి దేశం నుండి ఏం రాలేదు. మన పూర్వీకులు ఈ భారతదేశ గడ్డపైనే పుట్టి ఇక్కడే మరణించారు. హిందూ ముస్లింలు ఎప్పటికీ సోదర భావంగా కలిసి మెలసి ఉండాలి’ అని విరాళం ఇచ్చిన ముస్లిం కుటుంబ సభ్యులు ప్రసంగించారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.