అమరావతి: రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని టాలీవుడ్ నటుడు శివకృష్ణ అన్నారు. రాజధాని కోసం మందడం గ్రామంలోని రైతులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆదివారం అయన సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ రైతు కన్నీరు పెట్టిన రాష్ట్రం బాగుపడదని అన్నారు. తాను పుట్టిన తరువాత ఎప్పుడు మూడు రాజధానులు అనేది వినలేదనీ చెప్పారు. రైతులకు మోసం చేయడం తెలియదనీ, ప్రభుత్వాలు రైతులను మోసం చేయకూడదనీ శివకృష్ణ అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని ఆయన స్పష్టం చేశారు.