తెలుగు చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతితో సోకసముద్రంలో ఉండగా, మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట విషాదం నెలకొంది. మణిశర్మ మాతృమూర్తి యనమండ్ర సరస్వతి (88) తీవ్ర అనారోగ్య సమస్యతో కన్నుమూశారు. వృద్ధాప్య సంబందిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మణిశర్మ తల్లి సరస్వతి చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. మణిశర్మ తండ్రి వైఎస్ శర్మ నాలుగు సంవత్సరాల క్రితమే మరణించారు. ఇప్పుడు మణిశర్మ తల్లి కూడా మరణించడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మణిశర్మ బాల్యం నుండి సంగీతం బాటపట్టడంలో తల్లి సరస్వతి ప్రోత్సాహం ఎంతో ఉంది. ఈ విషయాన్ని మణిశర్మ పలు సందర్భాల్లో వెల్లడించారు. మణి శర్మ తల్లి మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
కృష్ణంరాజుకు మృతికి ప్రధాని మోడీ సహా ప్రముఖుల సంతాపం .. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!