పూజా హెగ్డే రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోయి ముంబై ఫ్లటెక్కేసింది. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై రెబల్ స్టార్ కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రశీద సమ్యుక్తంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడికల్ లవ్ స్టోరీగా radhe shyam తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లో 20 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో గొప్ప సినిమాగా నిలిచిపోతుందని అంటున్నారు.
కాగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. దాదాపు నెలన్నర నుంచి radhe shyam ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరుపుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ pooja hegde నెల రోజుల నుంచి రాధేశ్యామ్ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ ఫైనల్ షెడ్యూల్ లో పూజా హెగ్డే కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిందని సమాచారం. దాంతో హిందీలో కమిటయిన ప్రాజెక్ట్స్ షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబై ఫ్లైటెక్కింది.
ఈ విషయాన్ని స్వయంగా pooja hegde వెల్లడించింది. అంతేకాదు తాజాగా ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాఓ షేర్ చేసింది. దాంతో radhe shyam టీజర్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా నుంచి టీజర్ త్వరలో వస్తుందని భావిస్తున్నారు. మేకర్స్ కూడా ఈ నెల 26 న రిపబ్లిక్ డే సందర్భంగా రాధేశ్యామ్ టీజర్ ని రిలీజ్ చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఈసారైనా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తారా మళ్ళీ డిసప్పాయింట్ చేస్తారా ..!