రానా దగ్గుబాటి ప్రస్తుతం మొదలైన సినిమాల షూటింగ్స్ ని కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన హిరణ కశిప ఇక ఈ ఏడాది పట్టలెక్కడం లేదని నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి రిస్క్ తీసుకోలేకనే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారు. దీంతో గుణశేఖర్ మరో ప్రాజెక్ట్ ని ఇటీవలే అనౌన్స్ చేశారు. శాకుంతల పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు ప్రకటించారు.
ఇక రానా విరాట పర్వం అన్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, ప్రియమణి నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ మొదలవబోతుందట. నాన్ స్టాప్ గా 3 వారాల పాటు చిత్రీకరణ జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ 3 వారాల పాటు జరిపే షెడ్యూల్ తో సినిమా దాదాపుగా కంప్లీట్ అవుతుందని తెలుసుంది. అలాగే ద్విభాషా చిత్రం హాతి మేరే సాథి కూడా కంప్లీట్ చేయనున్నట్టు సమాచారం. విరాట పర్వం తర్వాత ఈ సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయనున్నాడట రానా.
కాగా ఇటీవల ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త సారాంశం ఏమిటంటే శోభన్ బాబు బయోపిక్ తెరకెక్కబోతున్నట్టు ఈ సినిమాలో రానా శోభన్ బాబు గా నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సాధారణంగా ఇప్పుడు హీరోలు బయోపిక్స్ చేయడానికి విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. కాని రానా ఇందుకు భిన్నంగా శోభన్ బాబు బయోపిక్ కి నో చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే కాదు ఇకపై కూడా బయోపిక్స్ లో నటించే ఓపిక గాని, ఆసక్తి గాని లేదని మేకర్స్ కి క్లారిటీ ఇచ్చాడు రానా. మరి రానా తో బయోపిక్ తీయాలన్న మేకర్స్ పరిస్థితేంటో ఇప్పుడు.