టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ మరియు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టీం విజయాల వెనుక గత కొన్ని సంవత్సరాల నుండి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉత్తమ బ్యాటింగ్ లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ విజయాల మీద విజయాలు సాధిస్తున్నారు. ఇటువంటి టైం లో స్ట్రైక్ రొటేట్ గురించి గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ…ఈ విషయంలో కెప్టెన్ విరాట్ కంటే ఆడేవాళ్ళు టీమిండియా లో ఎవరూ లేరని షాకింగ్ కామెంట్లు చేశారు. ఎప్పటికప్పుడు స్ట్రైక్ రొటేట్ చేస్తూ, స్కోర్ బోర్డు పరిగెత్తాలి అంటే గ్రౌండ్ లో విరాట్ ఉండాల్సిందేనని స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గౌతీ మాట్లాడాడు. “ అంతేకాకుండా రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ అతడు భారీ షాట్లు ఆడగలడు గాని స్ట్రైక్ రొటేట్ చేయలేడు.
విరాట్ కోహ్లీ దీన్ని గొప్పగా చేస్తాడు. అందుకే రోహిత్ కంటే నిలకడగా పరుగులు సాధిస్తుంటాడు. విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ కూడా స్ట్రైక్ రొటేట్ చేయలేడు. ఇక ఏబీ డివిలియర్స్ కూడా స్పిన్ బౌలింగ్లో తడబడతాడు. కానీ కోహ్లీ ప్రతి బంతికి పరుగులు సాధిస్తుంటాడు. అందుకే అతడు ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలుస్తూ 50 సగటుకు పైగా పరుగులు చేస్తున్నాడు” అని గంభీర్ అన్నాడు. ప్రజలకి ప్రతి బాల్ పెవిలియన్ గ్యాలరీలో చేరాలని ఉంటుంది..కానీ క్రీజ్ లో ఉన్న బ్యాట్స్ మాన్ కి ఒత్తిడి తగ్గాలంటే డాట్ బాల్స్ ఆడాల్సిందే. కానీ ప్రతి బాల్ పరుగులు సాధించే అతి తక్కువ ప్లేయర్స్ లో కోహ్లీ ఒకరు అని గౌతం గంభీర్ చెప్పుకొచ్చారు.
షాట్స్ ప్రతి ఒక్కరూ ఆడతారు క్లిక్ అయితే ఫోర్లు, సిక్సర్లు వస్తాయి, అవ్వకపోతే ప్రజలు నిరుత్సాహం చెందాల్సిన అవసరం ఉంటుంది అంటూ గౌతం గంభీర్ తెలిపారు. మొత్తం మీద ఈ ఇంటర్వ్యూలో కోహ్లీ ని ఓ రేంజ్ లో పొగిడి..గౌతమ్ రోహిత్ శర్మ గాలి తీసేసినట్టు మాట్లాడటం జరిగింది. కారణం చూస్తే అప్పట్లో ధోనీకి గౌతమ్ గంభీర్ కి వివాదాలు అయినట్లు వార్తలు వచ్చిన సమయంలో…జట్టులో రోహిత్ శర్మ ధోని కి మద్దతుగా ఉంటూ వ్యవహరించడంతో…ఆ కక్ష ను ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఈ విధంగా తీర్చుకుంటున్నారని స్పోర్ట్స్ అనలిస్టులు భావిస్తున్నారు.