ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అదేవిధంగా ప్రభుత్వ పాలనపై దేశవ్యాప్తంగా గట్టిగానే చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో అమలవుతున్న పాలన విధానం అద్భుతంగా ఉందని చాలామంది తల పండిపోయిన నేతలు ప్రశంసిస్తున్నారు. గతంలోనూ ప్రధాని మోడీ ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రశంసల వర్షం కురిపిస్తూ ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందని సూచించారు.
అయితే ఏపీలో మినహా ఇతర రాష్ట్రాల్లో పాలనపై మంచి రెస్పాన్స్ వస్తున్నాయని స్థానికంగా మీడియా సహకారం లేకపోవడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా పెద్దగా రెస్పాండ్ రావటం లేదని ప్రచారానికి సంబంధించి ఎమ్మెల్యేలకు చాలా సూచనలు జగన్ ఇచ్చిన వాళ్లు విఫలమవుతున్నట్లు గుర్తించారట. దీంతో రాష్ట్ర సమాచారశాఖ కి సంబంధించిన అధికారులతో జగన్ ఇటీవల భేటీ అయ్యి ఒక అనుభవం ఉన్న సంస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించి ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చే ఆలోచన జగన్ చేసినట్లు టాక్.
త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం వైసీపీ ప్రభుత్వం నుండి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల విధానం విషయంలో ప్రజలకు ఏ విధంగా ప్రచారం చేయాలి వంటి మెలుకువ లపై స్పెషల్ క్లాసులు ఎమ్మెల్యేలకు ఇప్పించడానికి జగన్ సర్కార్ రెడీ అవుతున్నట్లు టాక్. ఎక్కడా కూడా పార్టీ అని చూడకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న గాని గ్రౌండ్ లెవెల్ లో నుండి సరైన రెస్పాండ్ రావడంలేదని దానికి కారణం ఎమ్మెల్యేల పనితీరు అని గుర్తించడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.