సమాజంలో న్యాయవాద వృత్తి గౌరవప్రదమైనది.. న్యాయ పాలన సమర్థవంతంగా సాగే విషయంలో న్యాయవాదులదే కీలక పాత్ర.. న్యాయవాద వృత్తి పై ఆసక్తి ఉన్న విద్యార్థులు రాయవలసిన ముఖ్యమైన పరీక్ష క్లాట్.. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)- 2021 ప్రకటన విడుదల చేసింది.. దేశవ్యాప్తంగా 22 జాతీయ సంస్థల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఎల్.ఎల్.బి ఏడాది వ్యవధి ఎల్.ఎల్.ఎం కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షలో సాధించిన స్కోరు అవసరం.. దేశంలోని ఎన్నో ఇతర సంస్థలు క్లాట్ స్కోరుతో న్యాయ విద్యలో ప్రవేశానికి అవకాశాలను కల్పిస్తున్నాయి..
అర్హతలు :
*ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులు.
*ఎల్ ఎల్ బీ 5 సంవత్సరాల కోర్సులు చేరే విద్యార్థులు ఇంటర్ 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ , ఎస్టీ విద్యార్థులకు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
*ఎల్ ఎల్ ఎల్ ఎల్ ఎం కోర్సు చేయాలనుకునేవారు ఎల్.ఎల్.బి పరీక్షను 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ ,ఎస్టీ వారు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్షా విధానం :
ఈ పరీక్ష ఆఫ్లైన్ ద్వారా నిర్వహిస్తారు ఆబ్జెక్టివ్ తరహాలో ఈ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ , ఓబీసీ అభ్యర్థులకు రూ. 4000/-, ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు రూ 3500/-.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ :31/3/2021
పరీక్ష తేదీ : 13/6/2021
వెబ్ సైట్ : https://consortiumofnlus.ac.in