దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా పేదలకు ఏపీ లో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు జగన్ సర్కార్ కేటాయించటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పైగా ఇస్తున్న ఇళ్ల పట్టాలు మహిళల పేర్లమీద ఇస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు వైసీపీ ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో తాజాగా రాష్ట్రంలో పట్టణ నగర పరిధిలో ఉండే మిడిల్ క్లాస్ అదేవిధంగా పేదల కుటుంబాలకు ఇదే తరహాలో బంపర్ ఆఫర్ ప్రకటించడానికి జగన్ సర్కార్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలకు మరో పథకం అందించడానికి జగన్ సర్కార్ రెడీ అయింది.
రాష్ట్రంలో పట్టణ నగర పేదలకు తక్కువ ధరకు ఫ్లాట్లు అందించడానికి ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం లే అవుట్లను అభివృద్ధి చేయాలని వైసిపి ప్రభుత్వం డిసైడ్ అయ్యిందట. లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో ఈ ఫ్లాట్ లను మధ్యతరగతి, పేదలకు కేటాయించడానికి జగన్ ప్రభుత్వం డిసైడ్ అయినట్టు సమాచారం. క్లియర్ టైటిల్, వివాదాలు లేని ప్లాట్లు మధ్యతరగతి ప్రజలకు అందించాలని ఇందుకోసం అధికారులు మేధోమథనం చేసి ఓ పాలసీ తీసుకురావాలని తాజాగా సీఎం జగన్ ప్రభుత్వ అధికారులకు ఆదేశించారట. ఇప్పటికే గ్రామస్థాయి ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరోపక్క పట్టణ మరియు నగర మధ్యతరగతి ప్రజలకు కూడా ఇళ్ల పట్టాలు అందించాలని జగన్ సర్కార్ డిసైడ్ అవటంతో రాష్ట్రంలో పట్టణ, నగరంలో ఉన్న మధ్య తరగతి, పేద ప్రజలు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.