ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద కుటుంబాలకు మహిళా సభ్యుల పేరిట రిజిస్టర్డ్ హౌస్ సైట్లు ఇస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నానా పాట్లు పడుతున్న విషయాన్ని తెలిసిందే. కానీ ఇప్పుడు, రిజిస్ట్రేషన్ల ఈ ప్రక్రియను పూర్తి స్థాయిలో జరపలేము అని ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి లబ్ధిదారులకు హౌస్ సైట్ పట్టాల పంపిణీని మాత్రమే ప్రారంభించారు. కొన్ని కుట్రల కారణంగా తాను ప్రస్తుతం తన చెల్లెళ్ళకు కోసం రిజిస్టర్డ్ హౌస్ సైట్లు అనగా సొంత ఇంటి పట్టాలను ఇవ్వలేనని ప్రజలకు చెప్పాడు.
చట్టపరమైన అడ్డంకులను తొలగించిన తర్వాత, తన ప్రభుత్వం ఈ పట్టా హౌస్ సైట్లను లబ్ధిదారుల పేరిట అధికారికంగా నమోదు చేస్తుందని సిఎం నొక్కిచెప్పారు. అమరావతిలో వేలాది గృహ స్థలాల విషయంలో కూడా, ఇలాగే విపక్షాలు అడ్డంకులను సృష్టించాయి అన ఆయన గుర్తు చేశారు. ఏదేమైనా, భారత సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది అని ఆ తర్వాతే అర్హత కలిగిన పేద వారి అందరికీ తాము ఇంటి పట్టాలు పంచగలము అని సీఎం వ్యాఖ్యానించారు.
మునుపటి టిడిపి పాలనలో ఎన్నికలకు ముందే కొన్ని ఇళ్లను నిర్మించిందనఅన్నారు ఆరోపించారు. కానీ, వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 31 లక్షల కుటుంబాలకు మంచి నాణ్యమైన గృహాలను నిర్మిస్తుంది అని ఈ ప్రక్రియ కొత్త రాబోయే మూడేళ్లలో పూర్తవుతుంది అని… ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాదు, పేద ప్రజల కోసం ఇళ్ళు కూడా నిర్మించబడతాయి అని ప్రకటించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?