చంద్రన్న కానుకలపైనా, ఏపీ ఫైబర్ గ్రిడ్ పైనా సీబీఐ ఎంక్వైరీలు, అచ్చెన్న అరెస్టు తో జగన్ ప్రక్షాలన ముగిసేలా లేదనేది అందరూ చెబుతున్న మాటే అయినా… నెక్స్ట్ ఎవరు అనేది పెద్ద ప్రశ్న అయిపోయింది. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు, వస్తున్న లీకుల దృష్ట్యా… నెక్స్ట్ వీరే అనే కథనాలు ఆన్ లైన్ వేదికగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడిని ఈఎస్ ఐ స్కాం లో కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. తర్వాతి ఫైల్స్ ని కూడా సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. వీరిలో ఇంతకాలం అనుకున్నట్లుగా ఒకరిద్దరు కాదని… లిస్ట్ చాలా పొడవే ఉందని అంటున్నారు.
తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు సుప్రీత్ రెడ్డిల అరెస్టు అనంతరం టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనడంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు! పరిస్తితులు అలా ఉన్నాయి మ్మరి! జరుగుతున్న పరిణామాలకు తోడు… నేక్స్ట్ చంద్రబాబు – లోకేషే అని జేసీ దివాకర్ రెడ్డిలాంటి వారు మాట్లాడటం… ఇది త్రైలర్ మాత్రమే అని వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడటంతో.. జగన్ జాబితాలో ఎవరెవరు ఉన్నారు..? అనే విషయాలపై రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోతుంది.
ఈ క్రమంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో… మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడి పేర్లు నెక్స్ట్ జాబితాలో ఉండొచ్చని ప్రముఖంగా వినిప్స్తుంది! ఇదే క్రమంలో సాగినీటి ప్రాజెక్టుల విషయంలో దృష్టి సారించిన జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ తో వేల కోట్ల సొమ్ము వెనక్కి తెచ్చిన సంగతీ తెలిసిందే. ఈ లెక్కన ఇరిగేషన్ మాజీ మంత్రి దేవినేని ఉమాకి చెక్ పడె అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లే! అదేవిధంగా చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక పథకాల్లో రూ. 150 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించిన క్రమంలో మాజీమంత్రి పరిటాల సునీతకు చిక్కులు తప్పవని తెలుస్తుంది. ఇడ్ క్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే… జగన్ దగ్గర టీడీపీ మాజీ మంత్రుల లిస్ట్ చాలా పెద్దగా ఉందనే కామెంత్లు వినిపిస్తున్నాయి!