సీఎం జగన్ కు కోర్టులు అంతగా కలిసిరావడం లేదు. ఆయన పద్నాలుగు నెలల పాలనలో 70సార్లు ఇదే విషయం నిరూపితమైంది. ఇంగ్లీష్ మీడియం, మండలి రద్దు, ప్రభుత్వ భవనాలకు రంగులు, నిమ్మగడ్డ వ్యవహారం, విద్యుత్ పీపీఏ సమీక్షల్లో కోర్టు నుంచి వ్యతిరేక తీర్పులు వచ్చాయి. అయితే.. ఇప్పుడు జగన్ కు మరో అతిపెద్ద సవాలు ఎదురుకానుంది.
రానున్న 15 రోజులు కీలకం..
రాజధానిగా అమరావతి ఉండాలంటూ మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. దీనిని కోర్టు స్వీకరిస్తుందా.. తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఎవరికి తీర్పు వ్యతిరేకంగా వచ్చినా వారు సుప్రీంకోర్టుకు వెళతానడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఇప్పట్లో తేలేది కాదు. ఇప్పటివరకూ కోర్టుల వరకూ వెళ్లిన అంశాలు రాజధాని అంశం ముందు చిన్నవే. ఈ అంశం రాష్ట్ర ప్రజలందరికి సంబంధించి కాబట్టి మరింత ప్రతిష్టాత్మం కానుంది.
న్యాయ విభాగంపై జగన్ దృష్టి పెట్టారా..?
జగన్ బలహీనతలు న్యాయ విభాగం ద్వారా బయటపడుతున్నాయి. జగన్ ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా అన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. పరిపాలనలో తీసుకునే నిర్ణయాలకు న్యాయపరంగా చిక్కులు రాకుండా చూసుకోవడం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం. మంచి పరిపాలనాదక్షుడిగా జగన్ ఈ విషయంలో కూడా నిరూపించుకోవాల్సి ఉంది. రాజధాని విషయలో జగన్ న్యాయ విభాగం ఎలా వాదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీకి ఈ విషయంలో మంచి న్యాయ విభాగం ఉంది. జంధ్యాల రవిశంకర్ వంటి వారు చంద్రబాబుకు న్యాయ సలహాలు అందిస్తారు. కానీ.. జగన్ ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు. రాజధాని విషయంలో సరైన వాదనలు వినిపించలేక పోతే రాజధాని విషయంలో పరాభవం తప్పదు. జగన్ అనుకున్నది జరగాలంటే న్యాయపరంగా బలమైన పాయింట్లతో వెళ్లాల్సి ఉంటుంది. మరి జగన్ ఎలా ముందుకెళ్తారో చూడాలి.