ఏపీ సీఎం జగన్.. అక్టోబర్ 5న విశాఖకు వెళ్లనున్నారు. ఇప్పటికే సీఎం జగన్.. విద్యా కానుక పథకాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5న విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్.. ప్రారంభించనున్నారు. అయితే.. విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్.. విశాఖ జిల్లాలో ప్రారంభించాలని అనుకుంటున్నారట. అందుకే.. అక్టోబర్ 5న సీఎం జగన్ విశాఖకు వెళ్తున్నారు అని తెలుస్తోంది.
దీనికి సంబందించి.. ఇఫ్పటికే విద్యా శాఖ నుంచి ఉన్నతాధికారులకు సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. ముఖ్యమంత్రి ఆనందపురం మండలంలో ఉన్న గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కానుక పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
దీంతో ఆ పాఠశాలలో ఇప్పటికే అన్ని పనులు ప్రారంభించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా… విశాఖ జిల్లాలో మూడు స్కూళ్లను డెమో స్కూళ్లుగా అధికారులు ఎంపిక చేశారు. వాటిలో గిడిజాల పాఠశాల ఒకటి. ఈ స్కూల్ లో అన్ని సౌకర్యాల కోసం ప్రభుత్వం 37.5 లక్షలు కేటాయించింది. వెంటనే అన్ని పనులు పూర్తయ్యాయి.
ఒకవేళ ముఖ్యమంత్రి వస్తే.. ఇదే పాఠశాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక పథకాన్ని ప్రారంభిస్తారు. లేదంటే.. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని ఇదే పాఠశాల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.