CM Jagan VS Nimmagadda ; ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. మార్చి 10 న పోలింగ్ జరగనుంది. మార్చి 14 న కౌంటింగ్ జరగనుంది..! గత ఏడాది ఎక్కడ ఆగిందో అక్కడి నుండి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేలా ఎన్నికల కమీషనర్ ఉత్తర్వులిచ్చారు. సో.. ఇక ఏపీ ప్రభుత్వానికి – కమీషనర్ కి ప్రస్తుతానికి నో గొడవ. కానీ ఇక్కడితో ముగియలేదు. కీలకమైన మండల/ జిల్లా పరిషత్ ఎన్నికలు ముందున్నాయి. అవి కూడా ఎక్కడ ఆగాయో అక్కడి నుండి కొనసాగిస్తారా..? లేదా ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇస్తారా అనేది అత్యంత కీలకం కానుంది.
CM Jagan VS Nimmagadda ; ఈ సారికి కాంప్రమైజ్… కానీ అప్పుడు మాత్రం..!?
మున్సిపల్ ఎన్నికల్లో గత ఏడాది పెద్దగా ఏకగ్రీవాలు జరగలేదు. గొడవలు కూడా ఎక్కడా ఎక్కువగా జరగలేదు. నామినేషన్లు విషయంలో రచ్చలు, రగడలు, కిడ్నప్ ఆరోపణలు.. ఇతర వ్యవహారాలు ఏమి లేవు. అందుకే ఈ నోటిఫికేషన్ మాత్రం గత ఏడాదికి కొనసాగింపు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయిపోయారు. ఇది ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వడంలో పెద్దగా ప్రభుత్వం కూడా పట్టించుకోదు. ప్రభుత్వానికి వచ్చే నష్టమేమి ఉండదు. కానీ ఇరువర్గాలు మాట్లాడుకుని.. త్వరగా పూర్తి చేసే ఉద్దేశంతో కొనసాగింపు నోటిఫికేషన్ ఇచ్చేసారు అనుకోవచ్చు. నిమ్మగడ్డకి పెద్దగా సమయం లేదు. అందుకే దీనికి వివాదాలకు పోలేదు. కానీ పరిషత్ ఎన్నికలకు మాత్రం ప్రతిష్టంభన కొనసాగనుంది..!!
ప్రభుత్వానికి అత్యంత కీలకం ఇవే..!!
ప్రభుత్వానికి మండల / జిల్లా పరిషత్ ఎన్నికలే కీలకం. ఆ నోటిఫికేషన్ మాత్రమే కీలకం. గత ఏడాది సుమారుగా 25 శాతం స్థానాలు అధికార పార్టీకి ఏకగ్రీవాలు అయ్యాయి. ఒకవేళ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తే అవన్నీ వైసిపి ఖత నుండి పోయినట్టే. అసలే నిమ్మగడ్డ ఈసారి ఏకగ్రీవాలు విషయంలో కఠినంగా ఉంటున్నారు. అప్పుడు జరిగిన ఏకగ్రీవాలు అన్నీ కిడ్నాప్, గొడవలు, ఘర్షణలు, బెదిరింపులతోనే బలవంతంగా జరిగాయని నిమ్మగడ్డ కోర్టులో అఫడవిట్ కూడా వేశారు. అంటే ఆయన ఒప్పుకున్నట్టే. ఎన్నికల కమీషనర్ స్థానంలో ఉంటూ… తనే స్వయంగా అక్రమాలు జరిగాయని ఒప్పుకున్న ఎన్నికలను ఎలా కొనసాగిస్తారు. సో.. వాటిని రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. అదే జరిగితే…
కోర్టుకి ప్రభుత్వం/ నాటి విజేతలు..!?
ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇస్తే మాత్రం కచ్చితంగా ప్రభుత్వం కోర్టుకి వెళ్తుంది. నాడు ఏకగ్రీవంగా గెలిచిన విజేతలు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో.., ఇది తలనొప్పి తప్పదు. జాప్యం తప్పదు. అందుకే ముందుగా పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెట్టేసి.. తనకు తలనొప్పిగా మారే పరిషత్ ఎన్నికలను చివరి దశలో నిర్వహించాలి అని నిమ్మగడ్డ భావించి ఉండవచ్చు. అయితే కోర్టులో ఒక వారం/ రెండు వారాలు జాప్యం జరిగినా తనకు ఇబ్బంది లేకుండా మార్చి 31 లోగా తన మాటని నెగ్గించుకుని.. తాను అనుకున్నట్టు ఫ్రెష్ నోటిఫికేషన్ ద్వారా ఆ ఎన్నికలు నిర్వహించాలి అనేది నిమ్మగడ్డ ఆలోచన. సో.. ఈ వివాదం ఎలా ఆరంభమవుతుందో చెప్పవచ్చు.. ఎలా..? ఎవరికీ అనుకూలంగా ముగుస్తుంది అనేది మాత్రం అనుమానమే..!!