భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీవీ జ్ఞానభూమిలో ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తాను ప్రధాని మోదీని ప్రత్యేకాం కలిసి విన్నవిస్తానని అన్నారు. ఆయన కుటుంబసభ్యులను ఇందులో భాగస్వాములను చేస్తానని అన్నారు.
దేశం కోసం ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు.. దేశాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించిన ఆయన సృజన అందరికీ ఆదర్శమన్నారు. 14భాషల్లో ప్రావీణ్యం, సైన్స్, ఆస్ట్రానమీ రంగాల్లో అవగాహన ఆయన సొంతం. ఇంతటి ప్రతిభకు దేశ అత్యున్నత పురస్కారం దక్కాలని.. ఆ దిశగా కృషి చేస్తానని అన్నారు.