KCR : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో లో పాపులర్ పర్సనాలిటీ లపై, సెలబ్రిటీల పై, రాజకీయ నాయకుల పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం… అనుచితంగా మాట్లాడడం… ఉన్నవీ లేనివీ కల్పించి వారి పరువు కి భంగం కలిగించడం వంటివి ఎక్కువ అయిపోయాయి. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక యువకుడు చివరికి జైలు పాలయ్యాడు.
మామూలుగా ప్రభుత్వాలపై, వాటి పనితీరు పై. అలాగే ప్రభుత్వ అధినేత పై విమర్శలు చేసే వారు వేలల్లో ఉంటారు. దేశం లోని ప్రజలకు వాక్ స్వాతంత్ర్యాన్ని రాజ్యాంగం కల్పించింది. అయితే ఈ యువకుడు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో అడ్డంగా దొరికిపోయాడు. ఒక యువకుడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత మరొక యువకుడు అతని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతడిపై ఏకంగా కేసు పెట్టేశాడు.
2017లో భువనగిరికి చెందిన రామకృష్ణ అనే యువకుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నవంబరు 15న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. సీఎంపై రామకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన పాతబస్తీకి చెందిన ఇబ్రహీం… మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసు అధికారులు సైబర్ క్రైమ్ డిపార్ట్మ్ర్ంట్ కి ఆ కేసుని బదిలీ చేశారు.
వీడియోలో చేసిన ఆ వ్యాఖ్యల పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపగా… కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఇక ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు…. రామకృష్ణకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఐదేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించింది. కాబట్టి ఇక ఎవరైనా రాజకీయ నాయకులపై ఇలా బహిరంగంగా అనుచితమైన విమర్శలు చేస్తే జైలు పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న మాట…!