CM Ramesh: టీడీపీ కీలక నేతగా ఉంటూ రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న సీఎం రమేష్ మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఓడిపోగానే గోడ దూకేసి బీజేపీ పంచన చేరడం గుర్తుండే ఉంటుంది.నెంబర్ వన్ కాంట్రాక్టర్ గా ఉంటూ రమేష్ అనేక అక్రమాలకు పాల్పడి బాగానే సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి.తన ఆస్తులను రక్షించుకునే ఉద్దేశంతోనే ఆయన బీజేపీలో చేరిపోయారని కూడా టాక్.అయితే ఇదంతా గతం.
ఇప్పుడు రమేష్ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే ఆయన ఆదివారం ఒక కొత్త విమానానికి ప్రారంభోత్సవం చేశారు. ఆ విమానం ప్యాసింజర్ లాడర్ ముందు ఆయన కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు.తర్వాత విమానం ఎక్కగానే ఎయిర్హోస్టెస్ ఆయనకు విషెస్ చెప్పి సీట్లో కూర్చోబెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీంతో రమేష్ సొంతంగా చార్టర్డ్ ఫ్లైట్ కొనుక్కున్నారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీనిపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.
ముందుగా స్పందించిన వైసీపీ!
సీఎం రమేష్ విమాన వ్యవహారంలో ముందుగా వైసిపి స్పందించింది. రమేష్ విమానం కొనుక్కున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ మేరకు వైసీపీ ఐటీ సెల్ ఇన్చార్జి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు పోస్టులు పెట్టారు‘‘బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వటం లేదని కోపం వచ్చి.. బీజేపీలో చేరి స్పెషల్ ఫ్లయిట్ కొనుక్కున్న సీఎం రమేష్’’ అంటూ దేవేందర్ రెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు. అలాగే ‘‘విమానం కొన్న సీఎం రమేష్! తెలుగుదేశంలో ఉండి దోచుకోండి.. బీజేపీలో చేరి దాచుకోండి.. సొంత విమానం కొన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్.’’ అంటూ ప్రచారం హోరెత్తించారు.
CM Ramesh: ఆ విమానం స్నేహితుడిదన్న రమేష్!
వివాదం బాగా ముదిరిపోవడంతో సీఎం రమేష్ కార్యాలయం స్పందించింది.ఆ విమానం సీఎం రమేష్ ది కాదని, అతని స్నేహితుడిదని వివరణ ఇచ్చింది.స్నేహితుడి కోరిక మీద రమేష్ ఆ విమానానికి పూజ నిర్వహించారని తెలిపింది.సీఎం రమేష్ ఆ విమానాన్ని కొనుగోలు చేశారన్న వార్త పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది.అయితే ఇక్కడే మరో సందేహం మొదలైంది.ఒకవేళ నిజంగానే ఆ విమానాన్ని రమేష్ స్నేహితుడు కొనుగోలు చేసి ఉంటే అతడి పేరు వెల్లడించకుండా గోప్యత పాటించాల్సిన అవసరం ఏముందని కొందరు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు.సీఎం రమేష్ అతడి పేరు కూడా చెప్పేస్తే ఏ గొడవా ఉండదు కదా అని వారంటున్నారు.అది నిజమే అనిపిస్తోంది .మరి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం.