YS Jagan Delhi Tour: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ YS Jagan Delhi Tour కు వెళ్లారు. రెండు రోజులు అక్కడే ఉండి అమిత్ షాతో సహా ఐదుగురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ప్రస్తుత పర్యటన సీఎంకు ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాలు ఓవైపు.. రాష్ట్ర రాజకీయాలు మరోవైపు. ప్రస్తుతం అట్టడుకుతున్న అంశాలపైనే సీఎం జగన్ పర్యటనలో కీలకం కానున్నాయని చెప్పాలి. ప్రభుత్వానికి, పార్టీకి, సీఎం జగన్ కు రఘురామకృష్ణ రాజు అంశం తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా పోలవరం నిర్మాణం వేగంగా జరుగుతోంది. దీనికి రావాల్సిన నిధులు, ప్యాకేజీపై కూడా ఈ పర్యటనలో కీలకం కానున్నాయి. అయితే.. సీఎం పర్యటన కనిపిస్తోంది మాత్రం రాజకీయ కోణంలోనే అని చెప్పాలి.
ఇటివల రఘురామ అరెస్టు నుంచి సుప్రీంకోర్టు బెయిల్ వరకూ కథ నడిచింది. సుప్రీం ఆయన్ను మాట్లాడొద్దంటే మౌనంగానే తాను చేయాల్సింది చేసేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడి పవర్ చూపిస్తూ ఏకంగా ఎంపీలు, లోక్ సభ స్పీకర్, ప్రధాని, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులకు లేఖలు రాసి సంచలనం రేపుతున్నారు. ఈక్రమంలో అమిత్ షాతో జగన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశంపై ప్రముఖంగా చర్చిస్తారని అంటున్నారు. మరోవైపు మరో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు పోలవరంలో అవినీతి జరుగుతోందని రఘురామ కలిసి లేఖ ఇచ్చారు. ప్రస్తుతం నిధులు అవసరమైన సందర్భంలో ఆ ఆరోపణలు అబద్దం అని నిరూపించి నిధులు రాబట్టుకోవాల్సి ఉంది.
Read More: RRR case: జగన్ కంటే అడుగు ముందే RRR..! ఢిల్లీలో ఫీట్లు ఎన్నెన్నో..!
మరోవైపు రాజ్యసభలో మద్దతు ఇచ్చే అంశంపై బీజేపీకి వైసీపీ మద్ధతు బీజేపీకి అవసరం అవుతుంది. బీజేపీకి ఓటములు, రాజ్యసభలో బలం లేకపోవడం తెలిసిందే. మరోవైపు.. వ్యాక్సిన్ అంశంలో కేంద్ర వైఖరిని తప్పుబడుతూ రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా ఇరు నేతల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలో వ్యవసాయ చట్టాలకు జగన్ ఏకపక్షంగా మద్దతిచ్చారు. వ్యాక్సిన్ విషయంలో కూడా జగన్ నుంచి కేంద్రం పరోక్ష మద్దతు కోరే అవకాశం లేకపోలేదు. వీటన్నింటి దృష్ట్యా జగన్ ఢిల్లీ టూర్ ఖరారైందని చెప్పాలి. వీరందరి భేటీల్లో కూడా రాష్ట్ర అంశాలు చర్చకు వస్తాయని కూడా చెప్పాలి. మొత్తానికి జగన్ ఢిల్లీ నుంచి వచ్చాకే పూర్తి స్పష్టత రానుంది.