CM YS Jagan: ఏపి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జాబితాపై తుది కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో జగన్ మరో సారి సమావేశం అయ్యారు. నిన్న ఒక పర్యాయం జగన్ తో సజ్జల సమావేశమైయ్యారు. మరల ఈ రోజు సీఎం జగన్ రెండు గంటలకుపైగా భేటీ కొనసాగింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణైప చర్చించారు. చివరి క్షణం వరకూ ఈ చర్చలు కొనసాగుతాయని సీఎం జగన్ తో భేటీ అనంతరం సజ్జల పేర్కొన్నారు. ఈ నెల 11 వ తేదీ (సోమవారం) ఉదయం నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. కేవలం 24 గంటలు మాత్రమే సమయం ఉండటంతో మంత్రివర్గ సభ్యుల జాబితాను ఈ రోజు రాత్రికి గానీ రేపు ఉదయానికి గాని లిస్ట్ ఫైనల్ చేసి మంత్రుల రాజీనామాలతో పాటు కొత్త మంత్రుల జాబితా కూడా సీల్డ్ కవర్ లో గవర్నర్ వద్దకు పంపనున్నారు.
CM YS Jagan: వైసీపీ శ్రేణుల్లో జోరుగా చర్చ
పాత కేబినెట్ లోని 8 నుండి పది మంది మంత్రులకు మరో సారి అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరెవరని కొనసాగిస్తారు..కొత్తగా ఎవరికి అవకాశం లభిస్తుంది అనేది దానిపై వైసీపీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తమ నాయకుడికి మంత్రి పదవి వరిస్తుందో లేదోనని పలువురు కీలక నేతల అనుచరులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దాదాపు మంత్రివర్గంలో కన్ఫర్మ్ అనుకున్న నేతలకు పలువురు అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులకు రేపు సాయంత్రానికి అధికారికంగా ఆహ్వానాలు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సీఎంఓ అధికారులు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు
మరో పక్క అధికార యంత్రాంగం మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సచివాలయం పక్కన చేస్తున్నారు. గతంలో మంత్రులు ప్రమాణం చేసిన ప్రదేశంలోనే వేదిక ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పొలిటికల్ సెక్రటరీ ముత్యాలరాజు పర్యవేక్షిస్తున్నారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అధికార యంత్రాంగం పాస్ లను సిద్దం చేసి పంపుతున్నారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు నూతన మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత కొత్త కేబినెట్ కి సీఎం జగన్ హై టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ తో పాటు కొత్త మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.