CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ నిన్న విశాఖ వెళ్లారు. శారదా పీఠంలో జరిగే వార్షికోత్సవ వేడుకలకు హజరైయ్యారు. సీఎం రాక సందర్భంగా విశాఖలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిలో గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. దీంతో ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ లో చిక్కుకున్నందు వల్ల ఫ్లైట్ మిస్ అవుతుందని ప్రయాణీకులు ఆందోళన చెందారు. ఓ మహిళ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఆందోళన చేశారు. అక్కడి ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ప్రజలు పడిన ఇబ్బందులు మీడియాలో రావడంతో సీఎం వైఎస్ జగన్ స్పందించారు.
Read More: TRS: మోడీకి టీఆర్ఎస్ షాక్..!?
CM YS Jagan: ట్రాఫిక్ ఇబ్బందులు పునరావృత్తం కావద్దు
తన పర్యటనను పురస్కరించుకుని గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్.. వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత్తం అవ్వకూడదని అధికారులకు జగన్ గట్టిగా చెప్పారు. సిఎం జగన్ ట్రాఫిక్ సమస్యపై స్పందించడం పట్ల ప్రయాణీకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.