అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు.
సిఎంఒలో వైఎస్ జగన్ కొత్త టీమ్ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిపిగా గౌతమ్ సవాంగ్ను నియమించుకున్నారు. ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ధనుంజయరెడ్డిని, సిఎం ఒఎస్డిగా రిటైర్డ్ డిప్యూటి కలెక్టర్ కృష్ణమోహన్రెడ్డిలను నియమిస్తూ సిఎస్ ఎల్వి సుబ్రమణ్యం ఉత్తర్వులు ఇచ్చారు.
శుక్రవారం డిజిపి గౌతమ్ సవాంగ్, పలువురు ఐఎఎస్, ఐపిఎస్లతో తన క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్మోహనరెడ్డి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఐపిఎస్, ఐఎఎస్ల బదిలీలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. రేపటిలోగా వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పిలకు స్థానచలనం కలిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లూప్లైన్లో బాధ్యతలు నిర్వహించిన సీనియర్ అధికారులకు ఈ ప్రభుత్వంలో ప్రాధాన్యత పోస్టులు లభించే అవకాశం ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?