CM YS Jagan: రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. పారిశ్రామిక మంత్రిగా గౌతమ్ రెడ్డి చాలా కృషి చేయాలని అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. గౌతమ్ రెడ్డి మృతి తనకు, పార్టీకి తీరని లోటని చెప్పారు.
CM YS Jagan: గౌతమ్ రెడ్డి కన్న కలలు నెరవేరుస్తా
గౌతమ్ రెడ్డి తనకు చిన్ననాటి నుండి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. చాలా సందర్భాలలో తనకు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు జగన్. గౌతమ్ రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని అన్నారు జగన్. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బ్యారేజీ పనులను ఆరు వారాల్లో పూర్తి చేయడంతో పాటు ఆ బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని సీఎం జగన్ ప్రకటించారు. సంతాప తీర్మానం అనంతరం అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా పడింది.