Coconut : ఇంటిలో పూజలు వ్రతాలూ చేసే సందర్భం కలశాన్ని పెట్టుకుంటూ ఉంటాము.ఎంతో భక్తి శ్రద్ధల తో నియమ నిష్ఠలతో కూడా పూజ చేస్తాము. పూజ తర్వాతే అస్సలు సమస్య మొదలవుతుంది.ఆ కలశం మీద పెట్టిన కొబ్బరికాయ ఏమి చేయాలి?బియ్యం ఏమి చేయాలి? జాకెట్ ముక్కను ఏమి చేయాలి అని చాల సందేహాలు వస్తుంటాయి.
మరి కొంత మంది పూజ తర్వాత వాటిని ఒకపక్కన పెట్టి వదిలేస్తూ ఉంటారు…ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు చూసుకుంటే అవి పాడైపోయి ఉంటాయి… అసలు వాటిని ఎలా వాడాలో,ఏమి చేయాలో వివరంగా తెలుసుకుందాం… చాల మంది కొబ్బరి కాయను,కలశం క్రింద ఉంచిన బియ్యాన్ని బ్రాహ్మణులకు దానం గాఇస్తుంటారు .మరి కొంతమంది వరలక్ష్మి గా పూజించిన కొబ్బరి కాయను దానం చేస్తే లక్ష్మి దేవి ఇంటిలో నుండి వెళ్ళి పోతుంది అని భావిస్తుంటారు .
అలాంటప్పుడు ఆ కొబ్బరి కాయ తో ఏదైనా తీపి పదార్ధం తయారు చేసి నైవేద్యంగాతీసుకోవాలి. ఎట్టి పరిస్థితు లలో నూ ఆ కొబ్బరికాయ తో పచ్చడి లాంటివి చేసుకోకూడదు. కొబ్బరి తో కేవలం తీపి పదార్ధం అంటే కొబ్బరి సున్ని లేదా కొబ్బరి ఉండలు తయారు చేసుకుని ప్రసాదం గా స్వీకరించాలి. కొబ్బరి కాయ తో ప్రసాదం ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. లేదంటే కొబ్బరి కాయ కుళ్లి పోయే అవకాశం ఉంది. వీలైనంత తొందరగా ప్రసాదం చేసేసుకోవాలి. అలాగే కలశం కింద పెట్టిన బియ్యం తో కూడా పరమాన్నం లాంటి తీపి పదార్ధం చేసుకుని ఇంటిలో ఉన్న వారందరు ప్రసాదం గా స్వీకరించాలి. అలాగే కలశం లో ఉన్న నీటిని ఇంటిలో ని వాళ్లంతా శిరస్సు మీద చల్లుకుని మిగిలిన నీళ్లను మామిడాకులతో సహా చెట్టుమొదటిలో పోసేయాలి.
కలశం పై పెట్టిన జాకెట్ ముక్క బ్లౌజ్ గా కుట్టించేసుకోవాలి. కలశం లో వేసిన నాణాన్ని దేవుడి దగ్గర కానీ బీరు వాలో కానీ పెట్టుకోవచ్చు. ఇలా నియమ నిష్ఠ లతో కలశం పెట్టుకుని తర్వాత అంతే జాగ్రత్తగా అవన్నీవాడుకోవడం వలన లక్ష్మినారాయణుల అనుగ్రహం కలిగిఅష్టైశ్వర్యాలను పొందుతారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?