చైనా వారి అమానుష దాడి కి బలైన తెలుగు బిడ్డ కలనల్ సంతోష్ అంతక్రియలు కొద్ది సేపతి క్రితం అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట్ కు హైదరాబాద్ నుండి సంతోష్ మృతదేహం వస్తూ ఉండగా.. జన నీరాజనాల మధ్య పూల పాన్పు పై అతను విగతజీవుడై కదిలాడు.
ఇక సూర్యాపేట నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే కేశవరం గ్రామం సంతోష్ సొంత ఊరు కాగా అక్కడ అతనికి చివరిగా నివాళులు అర్పించారు. ఇకపోతే అంత్యక్రియలను ఆచారం ప్రకారం అతని కుమారుడు ముందుండి నడిపించగా… సీనియర్ రాజకీయ నాయకులైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బండి సంజయ్ కుమార్ మరియు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు.
హైదరాబాద్ నుండి సూర్యాపేట వచ్చే సమయంలో చాలా చోట్ల ప్రజలు ఆర్మీ వాహనాన్ని ఆపి అమరజీవుడైన సంతోషం మృతదేహం పై పూల వర్షం కురిపించారు. 2004లో ఆర్మీలో చేరిన సంతోషం మొట్ట మొదటి పోస్టింగ్ కశ్మీర్ లో కావడం విశేషం