చైనా భారత్ సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాల సైనికులు మధ్య జరిగిన ఘర్షణలో తెలుగు బిడ్డ సంతోష్ బాబు మరణించగా ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు భారతీయులందరి హృదయాలను కలచివేసింది. తెలంగాణ లోని సూర్య పేట కు చెందిన సంతోష్ బాబు విద్యానగర్ కు చెందిన బిక్కుమళ్ళ ఉపేందర్ – మంజుల దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. అతనికి ఒక సోదరి కూడా ఉంది.
సంతోష్ బాబు తండ్రి ఉపేందర్ ఎస్బిఐ లో చీఫ్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. అయితే దేశం పై ఉన్న అమితమైన భక్తి తో చిన్నప్పటినుండే సంతోష్ బాబు ఆర్మీ లోకి అడుగు పెట్టే విధంగా తయారుచేశాడు. తాను కూడా దేశానికి ఒక బిడ్డను సేవకు అర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా సంతోష్ ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకు కోరుకొండ సైనిక్ స్కూల్ లో విద్యనభ్యసించి అక్కడనుండి ఆర్మీలో చేరాడు. సైనిక్ స్కూల్ టాపర్ గా నిలిచిన సంతోష్ కి అన్నీ పరీక్షలు 95 శాతం మార్కులు రావడం గమనార్హం.
అదే జోరును ఆర్మీ లో కూడా చూపి 15 ఏళ్ల సర్వీసు లో నాలుగు పదోన్నతులు పొంది ప్రస్తుతం లోడఖ్ లో కమాండర్ గా విధులు నిర్వహిస్తూ వీరమరణం చెందాడు. అతని కెరీర్లో 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించిన వైనం ఇప్పటికీ భారత ఆర్మీ లో ప్రత్యేకం. తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కొడుకుగా మరియు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడిగా సంతోష్ ఆత్మకు శాంతి తప్పక చేకూరుతుంది.