Rice: తెల్లని అన్నంతో శివలింగాన్ని చేసి
మనిషి జీవితానికి ధనం , ఆనందం రెండు చాలా అవసరమైనవే. వీటికోసం పెద్దలు అనేక పరిష్కారాలు తెలియచేసారు. తెల్లని అన్నం (white Rice) కొన్ని కొన్ని పదార్ధాలు కలిపి నైవేధ్యంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం, ఆనందం కలుగుతాయి. తెల్ల అన్నాన్ని దేవునికి నైవేద్యంగాసమర్పించి ఆ ప్రసాదాన్ని పశువులు తినేందుకు పెట్టి, పెళ్లి కానివారికి తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.తెల్లని అన్నంతో శివలింగాన్ని (sivalingam) చేసి, పూజలు చేసిన తర్వాత నది నీటిలో వదిలిన వారి ఇంట్లోత్వరలోనే ఆర్థిక సమస్యలు తీరడం తో పాటు ఎన్నడూ డబ్బు ఇబ్బంది రాదు.
Rice: తెల్ల అన్నం, శనగపప్పు కలిపి
తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా పెట్టినవారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయి.
తెల్లని అన్నానికి పంచదార తేనెను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా పెట్టి అన్నదానాన్ని చేస్తే వారికి అన్ని రకాల రోగాలు ఉపశమిస్తాయి. తెల్ల అన్నం, శనగపప్పు కలిపి పాయసం చేసి ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి ఆ పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలు కలిగి ఉండి ప్రశాంత జీవనాన్ని గడుపుతారు. మనస్సులో ఉండే భీతి, భయం,బెదిరింపులన్నీ తగ్గిపోతాయి.తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యంగా పెట్టి నువ్వులను కాకులకు పెట్టడం వలన మీకు ఉన్న పితృ దేవతల అనుగ్రహం పొందుతారు.
అన్నం పసుపు, కుంకుమ కలిపి
అన్నం సరిగా తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి ప్రవహించే నీటిలోలేదా ఏదైనా చెట్టు మొదలులో కానీ వేస్తే ఎటువంటి దిష్టి అయినా పోతుంది. సాధారణ సమస్యలు అయితే ఈ పరిహారాల తో ఉపశమనం పొందుతారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం జాతక చక్రాన్ని పరిశీలించి దానికి తగిన పరిహారం చేసుకుంటే శాశ్వత ఉపశమనం లభిస్తుంది.