ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది… దేవుడు తలుపులు మూసిన ప్రతిసారి కిటికీలు తెరుస్తాడు అవకాశం కోసం… గట్టిగా బ్రతకాలి కట్టుకోవాలి సాధించాలి అనే తపన ఉంటే లోకంలో దారులు అనేకం… ఇప్పుడు బిగ్బాస్ అవినాష్ గురించి ఇదంతా…. బిగ్ బాస్ షోలో అరిచి బొబ్బలు పెట్టిన అవినాష్ తాను జబర్దస్త్ వదిలేసి వచ్చాం అని తనకు బిగ్ బాస్ నుంచి ఈ ఫోటో పంపిస్తే బతుకు లేదంటూ పలుమార్లు ఏడుపు మొహం పెట్టుకొని బిగ్ బాస్ ను ఆర్ధించడం అందరికీ తెలిసిందే… పాపం చివరి వరకు చేరుకోలేకపోయాడు.. మధ్యలోనే హౌస్ బయటకు వచ్చేశాడు.. ఇటు ఈటీవీ జబర్దస్త్ లో అవకాశాలు లేవు… పెద్ద నటుడు కాదు… తను అనుకున్నట్టే జీవితం అంతా చీకటి అయిపోయిందా?? అవినాష్ మరి ఏమి అవకాశాలు లేనట్టేనా..?? ఇప్పుడే చెప్పాను కదండీ కలుపు మూసేసిన ప్రతిసారి ఓ కిటికీ తెరిచి అవకాశాన్ని దేవుడు ఇస్తాడని… బిగ్బాస్ అవినాష్ కు ఇదే నిజమైంది.
ఈటీవీ నుంచి మల్లెమాల నుంచి నెట్టి వేయబడిన అవినాష్ కు మా టీవీ ఆశ్రయం కల్పించనుంది. అవినాష్ ప్రధాన పోస్టుగా ఓ కామెడీ షో మాటీవీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి స్టాండప్ కామెడీ గా ఉండే ఈ షో అవినాష్ ఆధ్వర్యంలోనే ముందుకు సాగుతుంది. దీనిపై ఇప్పటికే మాటీవీ తో అవినాష్ అగ్రిమెంట్ కూడా అయినట్లు సమాచారం. ఈ కామెడీ షో కు కామెడీ స్టార్ గా పేరు కూడా నమోదు చేయించినట్లు మా టీవీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
** ఇప్పటికే ఈ టీవీ మల్లెమాల కు అగ్రిమెంట్ కాగితాలను చించేసి మరి డబ్బులు కట్టి బయటకు వచ్చి బిగ్ బాస్ లో పాల్గొన్న అవినాష్ డేర్ స్టెప్ కు మొదట్లో చాలామంది సరికాదంటూ హితవు పలికారు. తర్వాత ఎవరూ అవకాశాలు ఇవ్వరాని, అసలే ఈటీవీ మల్లెమాల కాదంటే అసలు ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోరు అంటూ అవినాష్ ను ఎంతో భయపెట్టారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. పోటీ పెరిగింది.. టి ఆర్ పి ల వేటలో శాటిలైట్ ఛానళ్ల మధ్య పోటీ తత్వం బీభత్సంగా పెరిగింది. ఈ సమయంలో టాలెంట్ ఉన్నోడి దే రాజ్యం.. అతడు రాసిందే రాజ్యాంగం…
చివరగా చెప్పేదేమిటంటే జీవితంలో ఎప్పుడూ నూతిలో కప్పలా ఉండి పోవద్దు.. ఒక అడుగు వేసి చూడు అది విజయమో… అపజయమో నీకు పాఠాలు నేర్పిస్తుంది.