Adimulapu Suresh : ఆదిమూలపు సురేశ్ Adimulapu Suresh దేశంతోపాటు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉందనే విషయం తెలిసిందే. రాష్ట్రాల్లో రోజుకి వందల్లోని కేసులు వేలల్లో.. దేశంలో వేలల్లోని కేసేలు లక్ష, రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో వ్యాక్సిన్ లేనప్పుడు ఉన్న భయం కంటే.. వ్యాక్సిన్లు వచ్చాక పరిస్థితులు మరింత భయంకరంగా మారిపోవడం అర్ధం కానిది. ఇటువంటి పరిస్థితుల్లో అనేక వ్యవస్థలతోపాటు విద్యారంగం కూడా ఎఫెక్ట్ అయింది. దీంతో సీబీఎస్ఈ పది పరిక్షల రద్దు, ఇంటర్ పరిక్షలను వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి. కానీ.. ఆంధ్రప్రదేశ్ ఇందుకు విరుద్ధంగా వెళ్తోంది.
దేశమంతా ఒక దారైతే.. ఏపీది మరో దారిలా ఉంది. తెలంగాణ ప్రభుత్వం గతంలోనే స్కూళ్లు మూసేసింది. బార్లు, షాపింగ్ కాంప్లెక్స్ లకు లేని కరోనా స్కూళ్లకేనా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. తెలంగాణ నిర్ణయమే కరెక్ట్ అనే దిశగా పరిస్థితులు మారిపోయాయి. దేశంలో కరోనా విజృంభణ పెరిగిపోయింది. దీంతో వెంటనే కేంద్రం సిబీఎస్ఈ పరిక్షలు రద్దు చేసి, ఇంటర్ పరిక్షలు వాయిదా వేసింది.
ఐసీఎస్ఈ కూడా ఇదే బాట పట్టింది. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ కూడా పదో తరగతి పరిక్షలు రద్దు చేసేశాయి. కానీ.. ఏపీ మాత్రం చోద్యం చూస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. షెడ్యూల్ ప్రకారమే పరిక్షలు జరుపుతామని ప్రకటించింది. రోజురోజుకీ ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అనేక విద్యాసంస్థల్లో విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు కరోనా సోకడమూ జరిగింది.
అయినా.. ఏపీ విద్యాశాఖ కరోనాతో పోరాడుతున్నట్టు మంత్రి సరేశ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామనే ప్రకటించారు. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో ఉన్న కరోనా తీవ్రత మరో పది, పదిహేను రోజుల్లో తగ్గిపోతుందనే గ్యారంటీ లేదు. మరి.. ఏపీ ఇంకా స్కూళ్లు, కాలేజీల నిర్వహణ, పరిక్షల రద్దు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తుందో పాలకులకే ఎరుక. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఇది ఇబ్బందిపెట్టడమే. రేపు జరగబోయే సీఎం సమీక్షలో ఏం నిర్ణయం తీసకుంటుందోననే ఆసక్తి ప్రస్తుతానికి నెలకొంది. ఏదేమైనా.. అందరూ ప్రకటించాకే ఏపీ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయనే చెప్పాలి.