టాలీవుడ్ లో ఏ హీరో అయినా సినిమా చేయాలనుకునే దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలని తెరకెక్కించి బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ ఈ సినిమాని నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే 40 శాతం జరిగిన చిత్రీకరణలో కొత టాకీ పార్ట్ తో పాటు చిరంజీవి, రెజీనాల పై ఒక స్పెషల్ సాంగ్ ని కంప్లీట్ చేశారు. మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో 5 పాటలుంటాయట. ఇక దేవదాయ ధర్మదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా చిరంజీవి కనిపించబోతుండగా ఈ సినిమా కోసం కంప్లీట్ గా కొత్త మేకోవర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడన్న వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
2020 ప్రారంభంలోనే అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో హ్యాట్రిక్ సినిమా పుష్ప లో నటిస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. త్వరలో నల్గొండ ప్రాంతంలోని అడవుల్లో చిత్రీకరణ మొదలు కానుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్ కొరటాల శివతో సినిమాకి రెడీ అవుతాడట. అయితే ఈ సినిమాకి కొరటాల ” కారణజన్ముడు ” అన్న ఒక అద్భుతమైన టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్టు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఈ టైటిల్ అయితే అద్భుతంగా ఉంది కాని నిజంగా ఈ టైటిల్ నే కొరటాల అల్లు అర్జున్ సినిమా కోసం ఫిక్స్ చేస్తాడా లేదా అన్నది అధికారకంగా తెలియాల్సి ఉంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!