Movies: కరోనా వల్ల సినీ ఇండస్ట్రీ ఎక్కువగా నష్టపోయిందనే చెప్పాలి. దాదాపుగా అన్ని థియేటర్లు మూతపడ్డాయి. షూటింగులు ఆగిపోయాయి. దీంతో సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. ఫస్ట్ వేవ్ వచ్చి పోయిన తర్వాత మెల్ల మెల్లగా సినీ ఇండస్ట్రీ గాడిన పడింది. సెకండ్ వేవ్ తర్వాత ఒక్కోక్క సినిమానే రిలీజ్ చేస్తూ ఉండటంతో ప్రస్తుతం థియేటర్లు నిండిపోయాయి. అయితే ఏపీలో సినిమా టికెట్లపై ఇంకా క్లారిటీ రాకపోవడం వల్ల కొన్ని సినిమాలు రిలీజ్ డేట్లను ఇంకా తెలియజేయలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం చివరికి అఖండ, ఖిలాడీ, అఖండ, ఖిలాడీ, ఆచార్య, పుష్ప సినిమాలు బరిలో నిలవనున్నాయి.
ఆ సినిమాల మధ్య గట్టి పోటీ
అఖండ, ఖిలాడీ సినిమాలు త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే మిగిలిన ఆ రెండు సినిమాల గురించే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. ఆచార్య, పుష్ప పార్ట్ 1 సినిమాల విషయంలో ప్రస్తుతం టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్లాష్ జరుగుతోంది.
17న పుష్ఫ..అదే రోజు ఆచార్య?
పుష్ప సినిమాను డిసెంబర్ నెలలో 17వ తేదిన విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే అదే రోజు ఆచార్య టీమ్ కూడా తమ సినిమాను రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపుతోంది. అలా రిలీజ్ చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. దసరా, దీపావళి సందర్భంగా ఆ సినిమాలను రిలీజ్ చేయాలనుకుంటే ఏపీలో టికెట్ రేట్లు సెట్ కాకపోవడంతో ఎప్పుడు రిలీజ్ చేయాలనే తర్జనభర్జనలో ఉంది. దీపావళి పండగకు అఖండ ఓకే అయ్యింది. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ ఉంది.
తగ్గేదేలే అంటున్న బన్నీ టీమ్
ఇక వచ్చే వేసవికి రిలీజ్ చేస్తే అప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. అందుకే డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటూ ఉండగా పుష్ప టీం వెంటనే డేట్ ను 17న అని ప్రకటించి ఆచార్య టీమ్ కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ మెగా హీరోల్లో ఒకరు తగ్గాలి. లేకుంటే సినీ ఇండస్ట్రీ నష్టపోతుంది. మరి ఫైనల్ గా మెగా క్లాష్ తప్పదా లేక ఎవరైనా తగ్గుతారో లేదోనని అందరూ ఎదురుచూస్తున్నారు.