హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ అడ్వకేట్ జేఏసి నేతలు ఫిర్యాదు చేశారు. పవన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలపై దాడులు చేస్తున్నారనీ, తెలంగాణ ఏమైనా పాకిస్తానా అని పవన్ రెచ్చగొట్టేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పవన్ ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారనీ, ఆంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనీ జేఏసి నేతలు ఆరోపిస్తున్నారు.
దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని జేఏసి నేతలు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరిగిన సమయంలోనూ ఇక్కడున్న ఆంధ్రులపై తెలంగాణ ప్రజలు దాడులు చేయలేదనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు.
హైదరాబాద్లో ఎవరి భూములను లాక్కున్నారో చెప్పాలని జేఏసి నేతలు ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించి, తెలంగాణలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్న పవన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసిన వారిలో జేఏసి ప్రతినిధులు గోవర్ధన్ రెడ్డి, సిహెచ్ ఉపేందర్, తూడి శ్రీధర్ తదితరులు ఉన్నారు.