డిల్లీ, ఫిబ్రవరి 13: దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన రఫేల్ యుద్ధ విమానాల డీల్ పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక రాజ్యసభ ముందుకు బుధవారం వచ్చింది.
ఈ నివేదికలో సంచలన విషయాలను కాగ్ వెల్లడించింది.
యూపిఎ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న డీల్ కంటే నరేంద్ర మోది ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందమే బెస్ట్ అంటూ కాగ్ పేర్కొన్నది.
126 యుద్ద విమానాల కోసం గతంలో చేసుకున్న ఒప్పందం కంటే. ప్రస్తుత ప్రభుత్వం 36 విమానాల కోసం చేసుకున్నఈ ఒప్పందం 2.8 శాతం చీప్ అని తెలియజేసింది.
యుద్ధ విమానాల ధరను మాత్రం నివేదికలో కాగ్ పేర్కొనలేదు.
యుద్ధ విమానాల ఆధునికీకరణకు అయిన ఖర్చు కొత్త ఒప్పందంతో చాలా తగ్గిందని కాగ్ తెలిపింది. గత ఒప్పందం కంటే అయిదు నెలల ముందే 18 విమానాలు భారత్కు రానున్నాయని పేర్కొంది.
కాగ్ నివేదిక ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని విపక్షాలు మండిపడ్డాయి.
కాగ్ నివేదిక నేపథ్యంలో రాజ్యసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.