Bigg Boss 5 Telugu: మరి కొద్ది గంటల్లో ప్రసారం కాబోయే ఎపిసోడ్లో హౌస్లో త్రిమూర్తుల మధ్య బిగ్ బాస్(Big Boss) చిచ్చు పెట్టినట్లు.. తెలుస్తోంది. విషయంలోకి వెళితే హౌస్లో మొదటి నుండి షణ్ముఖ్(shanmukh) జస్వంత్, జెస్సీ (jessy), సిరి.. (Siri) ముగ్గురు గ్రూప్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. మోజో రూమ్ లో… ముగ్గురు ఎప్పుడు మీటింగులు పెడుతూ ఆడుతున్నారు. అక్కడే స్త్రాటజీలు కూడా ఈ ముగ్గురు వేస్తూ ఉంటారు. మొదటి నుండి ఈ ముగ్గురు బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటూ ఉంటది. ఈ నేపథ్యంలో హౌస్ లో చాలా మంది సభ్యులు కూడా ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు.
హౌస్ లో కెప్టెన్ గా శ్రీరామ్(Sri Ram) ఎంపికైన సమయంలో… కంటెస్టెంట్ జెస్సీ తో శ్రీ రామ్ కి గొడవ అయిన సమయంలో.. నీ వంట నువ్వే వండుకోవాలి అని అనటంతో ఒక్కసారిగా షణ్ముఖ్ జస్వంత్ రంగంలోకి దిగి కిచెన్ లో… అతి పెద్ద గొడవ సృష్టించడం ఐదవ వారంలో హైలెట్. ముగ్గురు లో ఎవరిని మిగతా కంటెస్టెంట్ లు దూషించిన దాడికి వచ్చిన గాని ఈ త్రిమూర్తులు ఏకమయి ఎదుటివారిని దెబ్బతీయడం జరుగుద్ది. ఆ రీతిగా ఈ ముగ్గురు ఉంటున్న క్రమంలో తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటెస్టెంట్ కోసం ఇంటి సభ్యులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇంటిలో జెస్సీ, సిరి కి.. బిగ్ బాస్ సీక్రెట్ ఇవ్వటం జరిగింది. దీంతో వీరిద్దరూ రెచ్చిపోయి మరి.. ఆడుకున్నారు.
షణ్ముఖ్ జస్వంత్ ఖంగుతిన్నాడు
జెస్సీ ఏకంగా సన్నీ తో గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత సిరి కూడా తో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో షణ్ముఖ్ జస్వంత్ నీ .. సైడ్ చేసినట్లు ఇద్దరు వ్యవహరించడంతో… షణ్ముఖ్ జస్వంత్ వీరిద్దరిపై మండిపడ్డాడు. ఈ దృశ్యాలు తాజా ప్రోమోలో బయటపడ్డాయి. అయితే లాస్ట్ కి బిగ్ బాస్… సీక్రెట్ టాస్క్ బాగా ఆడారని..జెస్సీ, సిరి లతో… అనటంతో షణ్ముఖ్ జస్వంత్ ఖంగుతిన్నాడు. ఇదే క్రమంలో తనకు సీక్రెట్ టాస్క్ ఇవ్వాలని.. కోరిన క్రమములో ముందు టాస్క్ లో పాటిస్పేట్ చెయ్యి అంటూ రవి.. సెటైర్ వేయడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే ప్రారంభం నుండి కలిసి ఉంటున్న త్రిమూర్తుల మధ్య సీక్రెట్ టాస్క్ ఇచ్చి ..బిగ్ బాస్.. చిచ్చుపెట్టడం ఈ వారంలో హైలెట్ గా మారినట్లు తాజా ప్రోమో బట్టి అర్థమవుతుంది.