అమరావతి, మార్చి 14: కాంగ్రెస్ పార్టీకి సంబందించి అభ్యర్ధుల జాబితా శుక్రవారం రాత్రి ప్రకటిస్తామని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు.
175 మంది ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్దుల ఎంపికకై కసరత్తు పూర్తి అయ్యందనీ, ప్రతి అభ్యర్ధి గురించి క్షుణ్ణంగా చర్చించామని రఘువీరా తెలిపారు.
అభ్యర్ధుల లిస్ట్ తో డిల్లికి వెళుతున్నామనీ, స్ర్కీనింగ్ కమిటిలో చర్చ జరుగుతుందని చెప్పారు. రేపు సాయంత్రం ఆరు గం.లకు రాహుల్ సమక్షంలో సీఈసీ కమిటి ద్వారా అభ్యర్దుల లిస్ట్ ఫైనల్ చేయడం జరుగుతుందని రఘువీరా తెలిపారు.
రేపు రాత్రికి అభ్యర్ధులని ప్రకటిస్తామనీ, అభ్యర్ధులు ఢిల్లీ, విజయవాడ, రావద్దని సూచించారు.