కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎదురవుతున్న కష్టాల్లో ఇదొకటి. ఇప్పటికే ఆ పార్టీ కీలక రాష్ట్రాల్లో ఎదురుగాలి తగులుతున్న సంగతి తెలిసిందే. అదే రీతిలో కీలక రాష్ట్రంలో సమస్యలు ఎదురయింది. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్కు మరో షాక్ తగిలింది. అనేక ట్విస్టుల తర్వాత ప్రభుత్వం గాడిన పడింది అనుకుంటున్న సమయంలో మళ్లీ ఆ ప్రభుత్వం సమస్యలు ఎదుర్కుంటోంది.
మళ్లీ మళ్లీ టెన్షన్ ఇదే….
రాజస్థాన్లో గెహ్లాట్ సర్కార్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిని ఎదిరించి బయటకు వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అంతర్గత పరిణామాలతో రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలు అయిన సంగతి తెలిసిందే. పార్టీలోని అంతర్గత వ్యవహారాలు కొన్ని రోజులు ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టగా తిరిగి గాడిలో పడిన తర్వాత ఇప్పుడు మరో సమస్య ఎదురయింది. సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్కు భారతీయ గిరిజన పార్టీ (బీటీపీ) మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో ప్రభుత్వం సమస్యల్లో పడింది. 2018 నుంచి అశోక్ గెహ్లాట్ సర్కార్కు మద్దతు ఇస్తున్న బీటీపీ ఇప్పుడు మద్దతు ఉపసంహరించుకోవడం హాట్ టాపిక్గా మారింది.
రెబెల్స్ సంక్షోభం తర్వాత….
అనంతరం చర్చల్లో సమస్యలు సద్దుమణిగాయి. ప్రతిపక్ష పార్టీ బీజేపీ గెహ్లాట్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి స్పీకర్ ఆమోదం తెలిపి బలపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో గెహ్లాట్ సర్కార్ మూజువాణి ఓటుతో గట్టెక్కింది. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ ఏడాది ప్రారంభంలో బలనిరూపణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవగా ఇటీవల రాజస్థాన్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గాయి. ఇక, బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ తరుణంలో ఇద్దరు ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకోవడం చర్చగా మారింది.. పంచాయతీ రాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని ఎదుర్కొన్న ఒక రోజు తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తమకు మద్దతు ఇవ్వలేదని ఆ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.