తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోతున్న తరుణంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ ఇటీవల హైదరాబాద్ నగరానికి రావడం తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నికల్లో అదేవిధంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు రావడం తో టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పదవి కి ఎవరు అర్హులు అనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ ఠాగూర్ ద్వారా అభిప్రాయాలు సేకరించి ఒక నివేదిక రూపంలో తేప్పించు కోవడం జరిగింది.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుండో పార్టీలో ఉన్న సీనియర్ నేతలు.. టీపీసీసీ చీఫ్ పదవి పొందడం కోసం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరుతున్నారట. ఈ విధంగా కోరుతున్న వారి లిస్ట్ చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య వంటి వారు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు లేదా రేపు పలువురు సీనియర్ నాయకులు ఢిల్లీ వెళ్లి పదవి విషయంలో క్లారిటీ తెచ్చుకోబోతున్నట్లు పార్టీలో టాక్ వస్తుంది.
దీంతో ఈ పదవి ఎవరికి అప్పగించాలనే దానిపై హైకమాండ్ లో కూడా టెన్షన్ నెలకొంది అనే వార్తలు వస్తున్నాయి. ఎవరికి ఇచ్చినా మిగతా సీనియర్లలో అసంతృప్తి నెలకొని పార్టీ మారే అవకాశం ఉందని, కాబట్టి టీపీసీసీ చీఫ్ పదవి కచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యం అయ్యేలా కట్టబెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు తెలంగాణ రాజకీయవర్గాలలో వినబడుతున్నాయి.