తెలంగాణ పీసీసీ పదవి ఎవరికి వస్తుందో అన్న టెన్షన్ టీ.కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా గాని తెలంగాణా లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అనుకున్న మేరకు రాణించలేకపోయింది అని సొంత పార్టీలో ఉన్న నాయకులే ఒప్పుకున్న పరిస్థితి. దానికి కారణం పార్టీలోనే గ్రూపు రాజకీయాలు ఉండటం అని చాలామంది చెబుతారు.
ముఖ్యంగా సీనియర్ నాయకుల వల్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారిందని తెలంగాణ రాజకీయ వర్గాలలో టాక్. ఇటీవల దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు చూస్తే.. ఇదే కంటిన్యూ అయితే వచ్చే రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి అన్నట్టు ఫలితాలు వచ్చాయి.
దీంతో తెలంగాణలో పార్టీని కాపాడుకోవడం కోసం రంగంలోకి దిగిన హైకమాండ్.. పీసీసీ చీఫ్ పదవి ఎవరికి కట్టబెట్టాలో అనేదానిపై రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ ఇటీవల రాష్ట్రంలో అభిప్రాయాలు సేకరించి దాన్ని నివేదిక రూపంలో హైకమాండ్ నాయకులకు ఇవ్వటం జరిగింది. ఇదిలాఉండగా పిసిసి చీఫ్ రేసులో ఉన్న వారిలో రేవంత్ రెడ్డి పేరు కూడా వినపడుతోంది. ఇదిలా ఉండగా పిసిసి పదవి తనకు కట్టబెడితే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు రేవంత్ రెడ్డి. చాలావరకు హైకమాండ్ కేసీఆర్ ని అదేవిధంగా బిజెపిని ఎదుర్కోవాలంటే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టాలని ఆలోచనలు చేస్తున్నట్లు పార్టీలో అంతర్గతంగా వినబడుతున్న టాక్.