Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ గ్రాఫర్ తగ్గుతున్న క్రమంలో కెసిఆర్ సరికొత్త ఎత్తుగడతో షర్మిల చేత పార్టీ పెట్టించడానికి రెడీ అవుతున్నట్లు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి కేసీఆర్ వదిలిన బాణం షర్మిల అని ఎద్దేవా చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో అభిమానులు ఉండొచ్చు గాని .. పాల కుటుంబసభ్యులు పార్టీ పెడితే ఆదరించే పరిస్థితిలో ప్రజలు ఎవరూ లేరని పేర్కొన్నాడు. షర్మిలకు తన అన్నయ్యతో విభేదాలు అంటే ఆంధ్రాలో చూసుకోవాలి కాని తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాజన్న బిడ్డ గా షర్మిల కి గౌరవం ఇస్తారు ఏమోగానీ పార్టీ పెడితే ప్రజలు మాత్రం ఏమాత్రం సహించరు అని స్పష్టం చేశారు. నిజంగా షర్మిలకి తెలంగాణ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే పులి చింతల, పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం పై షర్మిల వైఖరి చెప్పాలని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల మీద మరణ శాసనం రాయబోతున్న పోతిరెడ్డి పాడు, సంగమేశ్వరం పై కోర్టులో కేసు వేసి రావాలని ఆయన అన్నారు. అదే క్రమంలో అప్పట్లో తెలంగాణ వద్దు సమైక్యాంధ్ర ముద్దు అని అన్నారు కదా మరి ఇప్పుడు చనిపోయిన తెలంగాణ బిడ్డలు ముందు షర్మిల క్షమాపణ చెప్పగలరా అంటూ రేవంత్ ప్రశ్నించారు. వైయస్ బిడ్డగా ఏ కష్టం వచ్చినా తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు గానీ, రాజ్యాలు ఏలడానికి వస్తానంటే..కుదరదు అంటూ స్పష్టం చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకుని రాష్ట్రాన్ని దక్కించుకున్నారని తెలంగాణలో వైఎస్ అభిమానులు పేరిట ఇష్టానుసారంగా వ్యవహరించ వద్దు అంటూ రేవంత్ పేర్కొన్నారు. ఇదే టైమ్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైఎస్ అభిమానులు స్పష్టమైన స్టాండ్ తీసుకునే సందర్భం వచ్చిందని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఇటువంటి కీలక సమయంలో షర్మిల పార్టీ పెట్టడం వెనకాల కెసిఆర్ హస్తం ఉందని ఘంటా పథంగా చెబుతున్నారు రేవంత్ రెడ్డి.