కడప: విభజన హామీలను అమలు చేసే విధంగా రాష్ట్ర బిజెపి నేతలు ప్రధాని మోదిపై ఒత్తిడి తీసుకురావాలనీ లేకుంటే ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో తిరగలేరంటూ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి హెచ్చరించారు. కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్ మీద చూపే శ్రద్ధ రాష్ట్రంపై చూడపడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదాపై రాష్ట్ర బిజెపి నేతలకు శ్రద్ధ లేదని ఆయన అన్నారు. కనీసం ప్రధానిని అడిగే ధైర్యం కూడా బిజెపి నేతలు చేయడం లేదని తులసిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అంటూ కూడా బిజెపి నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారని తులసిరెడ్డి దుయ్యబట్టారు.
కశ్మీర్కు త్వరలో ప్రత్యేక ప్యాకేజి ఇస్తామంటున్న కేంద్రం విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన ప్యాకేజీ ఏమైందని తులసిరెడ్డి ప్రశ్నించారు. ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేకుండా పోయిందని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్ర ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్నందున ఆంధ్రబ్యాంక్ విలీనం చెయ్యడాన్ని విరమించుకోవాలని తులసి రెడ్డి సూచించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?