హైదరాబాదు: పోలవరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు గురువారం గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ, విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కలసి వినతి పత్రాన్ని అందించినట్టు కెవిపి తెలిపారు.
అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కెవిపి కోరారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరినట్టు కెవిపి వెల్లడించారు.
తన నుంచి గవర్నర్ మరిన్ని వివరాలను కోరారని, తన వద్ద ఉన్న అన్ని వివరాలనూ ఆయనకు అందించానని కెవిపి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సశ్యశ్యామలం అయ్యేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో అవసరమని కెవిపి పేర్కొన్నారు.