దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోలు ధరలకు నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. గుర్రపు బండిపై కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లేందుకు నేతలు ప్రయత్నించారు. నిరసనలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, శ్రవణ్, అంజన్ కుమార్ ను అరెస్టు చేశారు.
గాంధీ భవన్ ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. 23రోజులుగా పైసల్లో ప్రతిరోజూ వీటి ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై సర్వత్రా విమర్శలు వస్తున్నా కేంద్రం స్పందించటం లేదు. మొత్తంగా పెట్రోల్పై రూ.9.23, డీజిల్పై రూ.10.39 పెరుగింది.