2019 ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్ట మొదటి సారి ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోవడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో కచ్చితంగా ఒక చోట గెలవడం గ్యారెంటీ అని అందరూ భావించారు. కానీ పోటీచేసిన విశాఖ జిల్లా గాజువాకలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రజలు పవన్ కళ్యాణ్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోవడం గ్యారెంటీ అని అందరూ భావించారు. పవన్ ఓడిపోవడంతో ప్రత్యర్థులు కూడా ఇక పాలిటిక్స్ కి ప్యాకప్, సినిమాలకు మేకప్ అన్న తరహాలో సెటైర్లు వేశారు.
ఇటువంటి కామెంట్లు వస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ నేరుగా మీడియా ముందుకు వచ్చి నా చివరి కట్టె కాలే వరకు రాజకీయాల్లోకి ఉంటానని మాట ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపిన పవన్ ప్రస్తుతం సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వరుస ప్రాజెక్టులు లైన్ లో పెట్టారు. పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష టిడిపి చాలావరకూ డౌన్ లో ఉండటంతో సోము వీర్రాజు అధ్యక్షతన ఏపీబీజేపీ జగన్ ప్రభుత్వంపై అనేక విషయాలలో పోరాడుతూ ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పటివరకూ ప్రభుత్వంపై బిజెపి చేసిన పోరాటాలలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ నేరుగా పాల్గొన్న సందర్భాలు లేవు. కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి చాలా వరకు హైదరాబాదు లోనే పవన్ ఉంటూ వస్తున్నారు. ఏదైనా విషయం గురించి మాట్లాడాల్సి వస్తే సోషల్ మీడియాలో పత్రికా ప్రకటనలు ఇస్తూ రాణిస్తున్నారు. దీంతో ఈ విషయం బీజేపీ హైకమాండ్ దృష్టి దాక వెళ్ళటం జరిగిందట. మిత్ర పక్షం అయ్యుండి చేస్తున్న పోరాటంలో కలిసి పవన్ ముందుకు రాకపోవటం పై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి.
దీంతో పవన్ కళ్యాణ్ కి బీజేపీ హైకమాండ్ కొన్ని కండిషన్లు పెట్టినట్లు దానికి ఒప్పుకుంటేనే పొత్తు కొనసాగింపు ఉంటుందని సరికొత్త షరత్తు ఇటీవల విధించినట్లు టాక్. పవన్ కి బీజేపీ పెట్టిన కండిషన్ లలో టాప్ కండిషన్….బీజేపీ తలపెట్టబోయే ప్రతి ఆందోళన కార్యక్రమం విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలతో పాల్గొనాలని పవన్ కి షరతు విధించినట్లు సమాచారం. పైగా గ్రౌండ్ లెవెల్ లో కూడా జనసేన పార్టీకి సరైన క్యాడర్ లేకపోవడంతో…. ఇక రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మాట వినకపోతే బిజెపి కూడా పక్కన పెట్టేసే ఆలోచనలో ఉన్నట్లు అంతర్గతంగా రాజకీయ నాయకులలో జరుగుతున్న చర్చ.