తెలంగాణలో కరోనా వికృతరూపం దాలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో లేని కరోనా కేసులు అది ఎత్తేశాక తన ప్రతాపం చూపిస్తోంది. ఎంతో పకడ్బందీగా అమలు చేసిన లాక్ డౌన్ ఆంక్షలతో ఏప్రిల్ వరకూ పెద్దగా కరోనా కేసులు నమోదు కాలేదు. కానీ.. మే నుంచి మెల్లగా ప్రారంభమైన కేసుల సంఖ్య ఇప్పుడు జూన్ లో విపరీతంగా పెరిగిపోయాయి. రోజు రోజుకీ కరోనా కేసులు పెరగడం కలకలం రేపుతోంది.
ఇందుకు సంబంధించిన గ్రాఫ్ చూస్తే తెలంగాణలో కరానా విలయతాండం విస్తుపోయేలా చేస్తోంది. ప్రస్తుతానికి మొత్తం కేసుల సంఖ్య 11,364, యాక్టివ్ కేసుల సంఖ్య 6,446, రికవరీ 4,688, మరణాలు 230గా ఉన్నాయి. హైదరాబాద్ లోనే కేసులు ఎక్కువగా నమోదవడం కలవరపెడుతోంది. తెలంగాణలో కరోనా తీవ్రతపై కేంద్ర బృందాలు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.