వివిధ దేశాలలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులపై కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. భారత్ లోనూ కరోనా ఉదృతి మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులను వచ్చే నెల 31వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలను రద్దు చేసింది.
కొన్ని ప్రత్యేక రూట్లలో డీజీసీఏ ప్రత్యేక అనుమతించిన విమానాలు, కార్గో విమానాలు మాత్రం నడుస్తాయని తెలిపింది. కరోనా పరిస్థితులను అనుగుణంగా విమాన సర్వీసులను నడపనున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆప్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. కరోనా వేళ ప్రయాణాలకు సంబంధించిన ప్రయాణ, వీసా పరిమితుల పేరుతో కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 26న విడుదల చేసిన సర్క్యూలర్ లో మార్పులు చేస్తున్నామని తెలియజేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?