Corona Killed: కరోనా రెండో దశ విజృంభిస్తుంది. లక్షల్లో కేసులు, వందల్లో మరణాలు జరుగుతున్నాయి. నియంత్రణ సాధ్యం కావడం లేదు. కరోనా కొందరికి వెంటనే తగ్గిపోతుండగా.., కొందరిలో తిష్ట వేసి.. తిప్పలు పెడుతుంది.. కొందర్ని బలి తీసుకుంటుంది. తాజాగా విజయవాడలో ఒకే కుటుంబంలో నలుగురు కరోనాతో మృతి చెందడం అత్యంత విషాద ఘట్టంగా మిగిలిపోయింది. ఇదే నగరంలో కరోనా మొదటి దశలో కూడా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. అతనూ న్యాయవాదే.. ఈ కుటుంబ పెద్ద న్యాయవాదే కావడం ట్రాజెడీగా మిగిలింది. ఈ విషాద ఘటనతో నగరంలోని న్యాయవాదులూ.., ఆ విభాగానికి చెందిన వారు తీవ్ర విషాదంతో మునిగారు.
విజయవాడ నగరంలో పాత బస్తీకి చెందిన దినేష్ న్యాయవాది వృత్తిలో ఉన్నారు. ఆయన గంట కిందటే కరోనాతో మరణించారు. ఈ రోజు ఉదయాన్నే దినేష్ తండ్రి కూడా కరోనా కారణంగానే మరణించారు. మూడు రోజుల కిందట దినేష్ తల్లి, బాబాయ్ కూడా కరోనా తో మరణించారు. ఈ కుటుంబంలోని నలుగురూ కరోనాతో మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అత్యంత దయనీయ పరిస్థితుల మధ్య వారి మృత దేహాలను ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు.
Must Read ; నవంబర్ లో జరిగిన విషాదాన్ని ఈ లింకు ఓపెన్ చేసి చూడొచ్చు..!!
Corona Killed: నవంబర్ లో ఏం జరిగిందంటే..!?
విజయవాడ గాంధీనగర్ కి చెందిన సయ్యద్ ముజాహిద్ సుల్తాన్ మూసవి అనే లాయర్ కుటుంబం కరోనాతో మృతి చెందింది. ఆయనతో పాటూ.., భార్య లుబ్నా, వయసు 48 .., తల్లి ఫాతిమా (85 ).., కుమారుడు కూడా మరణించారు. నవంబర్ 2 న ఆయన మరణించగా.. అక్టోబర్ 15 న ఆయన తల్లి, అక్టోబర్ 30 న భార్య , కుమారుడు మరణించారు. సొసైటీలో పేరు ప్రఖ్యాతులతో ఆయన ఉల్లాసంగానే జీవితాన్ని గడుపే దశలో ఆయన కుటుంబం మరణంతో నగరంలో న్యాయవాదులు.. వాకర్స్ మూగబోయారు. అది మరువక ముందే ఈ తాజా ఘటనతో మరింత కనీరు మున్నీరుగా విలపిస్తున్నారు..!