Bangalore : మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకి దేశంలో చాలా సిటీలలో భయం ఆ విధంగానే ఆవరించి ఉంది. బెంగళూరు Bangalore సిటీ లో కూడా ఇంకా కరోనా దెబ్బకు ఈ జనాలు వణికిపోతున్నారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా గాని కొత్త కరోనా వైరస్ దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ కేసు తాజాగా బయటపడటంతో ..కర్ణాటక ప్రభుత్వం వణికిపోతోంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో బ్రిటన్ కొత్త స్ట్రెయిన్ కేసులు 25 నమోదు కావడంతో పాటు ఇప్పుడు కరోనా వైరస్ దక్షిణాఫ్రికా వేరియంట్ ఏసు బయటపడటంతో బెంగళూరు నగర వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. శివమొగ్గ జిల్లాకు చెందిన వ్యక్తిలో కరోనా దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి.
ఇటీవల ఈ వ్యక్తి బ్రిటన్ నుంచి బెంగళూరు కి చేరుకున్నారు. కరోనా నిబంధనల ప్రకారం కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమాన పాసింజర్ లకు ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తూ ఉండగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ టెస్ట్ నమూనాలను మరింతగా పరీక్షించడానికి ల్యాబ్కు పంపించారు. దక్షిణాఫ్రికా వేరియంట్ వల్ల చాలా వరకూ ఆఫ్రికా దేశాలు లాక్డౌన్ లోకి వెళ్లి పోయిన పరిస్థితి ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. మరోపక్క బ్రిటన్ స్ట్రెయిన్ కేసులు వల్ల కూడా యునైటెడ్ కింగ్డమ్ దేశాలు ప్రస్తుతం ఒకదాని తర్వాత మరొకటి లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతోంది. ఇలాంటి తరుణంలో బ్రిటన్ స్ట్రెయిన్ పాజిటివ్ కేసులతో పాటు కరోనా వైరస్ దక్షిణాఫ్రికా వేరియంట్ కేసులు బయటపడటంతో బెంగుళూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేసులు మరింతగా బయటపడితే మళ్లీ లాక్ డౌన్ విధించే ఆలోచన చేస్తూ ఉంది కర్ణాటక సర్కార్.