ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ చాలా సజావుగా సాగుతోంది. జనవరి 16న మొదలైన టీకాలు పంపిణీ వారం రోజులుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది. ఈ వారంలో దాదాపు 14 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం టీకాలు వేసినట్లు లెక్కలు చూపించింది. అయితే ఇలాంటి సమయంలో బయటకు వచ్చిన ఒక వార్త అందరినీ షాక్ కు గురి చేస్తోంది. గతంలో ఒకసారి కరోనా సోకిన వ్యక్తికి అంత సులువుగా రెండవసారి ఈ వైరస్ సోకదని అప్పట్లో వార్తలు వచ్చాయి. వైద్యులు దానిని నిర్ధారించకపోయినా వారికి మళ్లీ కరోనా రావడం వంటి ఉదంతాలు అయితే పెద్దగా లేవు.
అయితే రాజస్థాన్ లో ఒక మహిళకు ఏకంగా 31 సార్లు సోకినట్లు తెలిసింది. వైద్యులు ఆమెకు టెస్టులు నిర్వహించిన ప్రతిసారి పాజిటివ్ వచ్చింది. ఈ వార్త దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో భరత్ పూర్ పరిధిలో 35 ఏళ్ల మహిళకు 31 సార్లు వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. గడిచిన ఐదు నెలల్లో ఈమె నమూనాలను 31 సార్లు వైద్యులు పరీక్షించగా ప్రతిసారి పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. చేసే పరీక్ష విధానం మారినప్పటికీ ప్రతిసారి పాజిటివ్ అని రిపోర్టు లో రాయడం గమనార్హం.
హోమియోపతి అల్లోపతి వంటి అన్ని రకాల వైద్యాలను అనుసరించి ఆమెకు వైద్యం ఇప్పించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె ఆర్బీఎం ఆస్పత్రిలో ఉన్న ఆమె ఆప్నాఘర్ ఆశ్రమంలో ఉంటుంది. వాస్తవానికి కరోనా సోకిన వారు తీవ్రమైన వారికి బలహీనతకు గురవుతారు. అయితే విచిత్రంగా ఆమె ఏడు నుండి ఎనిమిది కిలోల బరువు పెరిగింది. గత ఏడాది ఆగస్టు 20న ఆమె మొదటిసారి కరోనా సోకింది. అప్పటినుండి ఆమె ఇప్పటికీ కూడా పూర్తి ఆరోగ్యంతో ఉందని చెబుతున్నారు.
ఆమె పొట్ట భాగంలో ఇంకా వైరస్ ఉండటం వల్లే ఇలాంటి రిపోర్ట్లు వస్తున్నాయి అని అనుమానం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మరి ఇలా ప్రతి సారి వైరస్ టెస్టు పాజిటివ్ వస్తుంది కానీ ఆమె ఐదు నెలలు ఎలాంటి దిగులు లేకుండా బ్రతికే ఉంది. దీని గురించి శాస్త్రవేత్తలు త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం ఆశాభావం వ్యక్తం చేశారు.