కరోనా కట్టడికి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వృథా అవుతున్నాయా ఆని అనుమానం కలుగుతోంది.కరోనా విషయంలో ప్రభుత్వంలో కనిపిస్తున్న చిత్తశుద్ధి జిల్లా అధికార యంత్రాంగంలో లేకపోవటమే ఇందుకు కారణం.
ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన ఒక సంఘటన కరోనా విషయంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది.ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ బయటపెట్టడం కూడా ఇంకో విశేషం
ప్రకాశం జిల్లాలో వైరస్ అనుమానితుల నుంచి సేకరించిన 27వేల నమూనాలు, కిట్లు వృథా అయ్యాయని కలెక్టర్ పోలా భాస్కర్ స్వయంగా వెల్లడించారు ..వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యంవల్ల ల్యాబ్ సిబ్బంది ఒకరు మరణించారు’ అని కూడా ఆయన పేర్కొన్నారు . అనుమానిత లక్షణాలున్న వారి నుంచి నమూనాల సేకరణలో క్షేత్ర స్థాయిలో పొరపాట్లు దొర్లుతున్నాయి.
సేకరించిన వాటికి ఐడీ నంబర్లు వేయడం లేదు. మూత లేకుండానే కొన్నింటిని ల్యాబ్లకు పంపిస్తున్నారు. టెస్టింగ్ కేంద్రాల్లో నమూనాలు పక్కన పెడుతున్నారని ఆయన శనివారం కరోనా సమీక్షా సమావేశంలో ఉదహరించారు.ఫలితంగా అన్ని వేల కిట్లు వృథా అయ్యాయన్నారు. ఒక్కో కరోనా టెస్టుకు ప్రభుత్వం 1100 రూపాయలు ఖర్చుపెడుతుంటే సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు.పద్ధతి మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైద్య సిబ్బందికి ఆయన వార్నింగ్ ఇచ్చారు.
ఈ కిట్ల వృథా వల్ల ప్రకాశం ఒక్క ప్రకాశం జిల్లాలోనే మూడు కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు య్యాయి.ఇది ఒక ప్రకాశం జిల్లాకే పరిమితం కాలేదని ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ తరహా పరిస్థితి నెలకొని ఉందంటున్నారు.అయితే అక్కడ ఈ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేస్తున్నారని వినికిడి.ఏదేమైనప్పటికీ జగన్ ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయి పట్టు సాధించడంతో పాటు ఇలాంటి వ్యవహారాలు జరిగిన చోట అధికారులపై కఠిన చర్యలు తీసుకుని తమతో ఆషామాషీ కాదన్న సంకేతాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.