మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి వెళ్ళబోతున్నాం. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన కరోనా వైరస్ దెబ్బకీ చాలా మంది జీవితాలతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి చాలా వరకు దెబ్బతింది. దాదాపు ఆగస్టు వరకు లాక్ డౌన్ ఉండటంతో పేదవాళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంత కంట్రోల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించినా గాని వల్లకాలేదు.
ఇటువంటి తరుణంలో ఇంకా కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కూడా రాని పరిస్థితుల్లో కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ బయట పడటం మాత్రమేకాక ఇండియా లోకి రావడంతో కేంద్రం హడలెత్తి పోతుంది. స్ట్రెయిన్ వైరస్ మొదటిదాని కంటే 70 శాతం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కేంద్రం సరికొత్త ఆదేశాలు రాష్ట్రాలకు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూనే మరోపక్క స్ట్రెయిన్ వైరస్ ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ముఖ్యంగా టెస్టులు, బాధితులను ట్రేస్ చేయడం, కంటోన్మెంట్ ఏరియాలో పకడ్బందీ ఏర్పాట్లు వంటివి పక్కాగా అమలు చేయాలంది. అదే విధంగా దేశ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని, ఇల్లు విడిచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ తో పాటు మాస్కు ధరించాలి అని తెలిపింది. ఇదిలా ఉండగా స్ట్రెయిన్ వైరస్ దెబ్బకి యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. భారీ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నా తరుణంలో, దీని ఎలాగోలాగా కంట్రోల్ చేయాలని శతవిధాల ప్రయత్నాలు మొదలు పెట్టాయి. స్ట్రెయిన్ వైరస్ మొదట బ్రిటన్ దేశంలో బయటపడటంతో.. బ్రిటన్ దేశం నుండి విమాన రాకపోకలు అన్ని దేశాలు ఆపేశాయి.